ఇడ్లీ, సాంబార్ వివాదం.. బీసీసీఐకి సీఎస్‌కే ఫిర్యాదు

కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య వైరం మైదానం దాటి ఇప్పుడు బోర్డు మెట్లు ఎక్కింది. ఏప్రిల్ 5న చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా హోస్ట్ టీమ్ డీజే ప్రవర్తనపై సీఎస్‌కే మేనేజ్‌మెంట్ బీసీసీఐకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఆ మ్యాచ్ సమయంలో డీజే “దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ” అనే పాటను ప్లే చేశారు. సాధారణంగా దక్షిణ భారత రాష్ట్రాలపై మీమ్స్‌లో వాడే ఈ పాట తమ తమిళనాడు అస్తిత్వాన్ని కించపరిచేలా ఉందని సీఎస్‌కే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రకమైన స్టీరియోటైపింగ్ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇది తమను ఎగతాళి చేయడమేనని ఫ్రాంచైజీ పేర్కొంది. సాధారణంగా డీజేలు హోమ్ టీమ్‌కు మద్దతు ఇస్తారని, కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉందని సీఎస్‌కే మేనేజింగ్ డైరెక్టర్ కాశీ విశ్వనాథన్ అసహనం వ్యక్తం చేశారు.

ఈ వివాదానికి 2025లో జరిగిన ఒక ఘటనతో సంబంధం ఉంది. అప్పట్లో ఆర్సీబీ ప్లేయర్ జితేష్ శర్మ (Jitesh Sharma) ఇదే పాటను పాడుతున్న వీడియో వైరల్ కావడంతో, చెన్నై డీజే అతడిని ఆటపట్టించారు. అయితే ఆ ఘటన తర్వాత తమ సిబ్బంది తటస్థంగా, గౌరవంగా ఉండేలా కఠిన నిబంధనలు అమలు చేశామని విశ్వనాథన్ గుర్తుచేశారు. ప్రత్యర్థి ఆటగాళ్లపై డీజేలు ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదనేది తమ పాలసీ అని ఆయన స్పష్టం చేశారు. మైదానంలో బెంగళూరు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో చెన్నైపై (CSK) విజయం సాధించి జోరు మీదుంది. సరిగ్గా ఇదే సమయంలో డీజే ఎంపిక చేసిన పాటలు, చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతను పెంచాయి. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా సాగిన ఈ వ్యవహారంపై ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ ఫిర్యాదుపై బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Read Also : ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ఆర్సీబీ ఏం చేయాలంటే?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>