కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2026 (IPL 2026) లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ విశ్వరూపాన్ని ప్రదర్శించింది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో అతనదైన మార్క్ చూపించుకుంటోంది. బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి, పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపడటమే కాకుండా, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరువలో నిలిచింది. ప్రస్తుతం ఆడిన 5 మ్యాచ్ల్లో 8 పాయింట్లు సాధించిన ఆర్సీబీ, ప్లేఆఫ్స్కు చేరాలంటే మిగిలిన 9 మ్యాచ్ల్లో కనీసం 4 మ్యాచ్లు గెలవాల్సి ఉంది. ఒకవేళ 6 లేదా 7 విజయాలు సాధిస్తే టాప్-2లో నిలిచే అవకాశం కూడా ఉంటుంది. ఆర్సీబీ తన తదుపరి మ్యాచ్ను ఏప్రిల్ 18న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది.

