కలం మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా నర్సాపూర్ (Narsapur) మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీజేపీతో కలిసి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ కౌన్సిలర్ రాజు యాదవ్, వైస్ చైర్మన్గా బీజేపీ కౌన్సిలర్ బుచ్చెష్ యాదవ్ ఎన్నికయ్యారు. నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 15 వార్డుల్లో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 4 వార్డుల్లో గెలిచారు. కాంగ్రెస్కి మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో బీజేపీ (BJP) తో చేతులు కలిపి నర్సాపూర్ చైర్మన్ పీఠం గెల్చుకుంది.
Read Also: తెలంగాణ జాగృతిలో చేరిన కావేటి మనోహర్
Follow Us On : WhatsApp


