కలం మెదక్ బ్యూరో: జన గణనలో ఎన్యూమరేటర్లు (Enumerators), సూపర్వైజర్ల పాత్ర కీలకమని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ (Collector Pratima Singh) అన్నారు. మెదక్ (Medak) జిల్లా టేక్మల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెన్సెస్ శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణా కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనగణన ప్రక్రియలోని 34 పాయింట్లను జాగ్రత్తగా అధ్యయనం చేయాలని సూచించారు. ఫీల్డ్ సిబ్బందికి జనగణన ప్రక్రియ, నియమాలు, బాధ్యతలపై అవగాహన కల్పించాలని అన్నారు. డేటా సేకరణను సక్రమంగా నిర్వహించాలని, జనగణను పక్కాగా చేయాలని ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు ఆమె సూచించారు.
Read Also: అజారుద్దీన్కు లైన్ క్లియర్ ?
Follow Us On: X(Twitter)

