కలం, సినిమా : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా పరిచయం అవుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సిగ్మా’(Sigma). జులై 31న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకులలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్కు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభించడంతో సినిమా హైప్ మరింత పెరిగింది. భారీ బడ్జెట్తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించగా.. క్యూట్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది. అలాగే రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు దాసన్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సరిగమ ఈ చిత్ర ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. భారీ తారాగణం, టెక్నికల్ టీమ్, హైప్ కారణంగా ‘సిగ్మా’ సినిమాపై బాక్సాఫీస్ అంచనాలు మరింత పెరిగాయి.

