కలం, రఘునాథపల్లి: జనగామ (Jangaon) జిల్లా రఘునాథపల్లి (Raghunathpalli) మండలం నిడిగొండ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రెండు లారీలు ఢీకొన్నాయి. ఇసుక లారీ వేగంగా వెళ్లి పత్తి బెల్ల లారీని ఢీకొనడంతో రెండు వాహనాలు కిందపడిపోయాయి.
ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

