కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth) సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ఉండవని తేల్చి చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం ఉంటుందని చెప్పారు. విద్యా విధానంలో కీలక మార్పులు తీసుకొస్తున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యా విధానంను తెలంగాణలో అమలు చేస్తామని సీఎం చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ విద్యావిధానం అమల్లోకి వస్తుందని సీఎం రేవంత్ ప్రకటించారు. సీఎం ప్రకటనతో రాబోయే విద్యా సంవత్సరం నుంచి టెన్త్ ఎగ్జామ్స్ తెలంగాణలో ఉండబోవని తెలుస్తోంది.
Read Also: చైనా మరో ఆవిష్కరణ.. రోడ్డెక్కిన సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటీలు, ఇక నో డ్రైవర్!
Follow Us On: Facebook

