epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

వైసీపీ ‘పోలవరం’ను గోదావరిలో ముంచేసింది : సీఎం చంద్రబాబు

కలం, వెబ్​ డెస్క్​ : ఆంధ్రప్రదేశ్​ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)ను సందర్శించారు. అనంతరం నిర్వహించిన ప్రెస్​ మీట్ లో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉంటే గతంలోనే ప్రాజెక్టు పూర్తయ్యేదని తెలిపారు. వైసీపీ హయాంలో హయాంలో డయాఫ్రమ్​ వాల్​ కూడా కాపాడలేకపోయారని విమర్శించారు.

ఐఐటీ హైదరాబాద్​ నిపుణులు చెప్పాకే డయాఫ్రమ్ వాల్​ పాడయిందని గతంలోని ప్రభుత్వానికి తెలిసిందని చెప్పారు. భవిష్యత్తులో వచ్చే సమస్యలను దృష్టిలో పెట్టుకుని డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. 2027 ఫిబ్రవరి 15 వరకు డయాఫ్రమ్​ వాల్​ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) ఫెజ్​–1 , ఆ తరువాత ఫేజ్ –2 పనులపై దృష్టి పెడతామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

Read Also: అమ‌రావ‌తిలో మంత్రి నారాయ‌ణ‌కు చేదు అనుభ‌వం

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>