కలం, వెబ్ డెస్క్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) విశాఖపట్నంలో సందడి చేశారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం ప్రాధాన్యతను చాటిచెబుతూ ఆయన స్వయంగా సైకిల్ సవారీ చేశారు. విశాఖ తీర ప్రాంతంలో సైకిల్పై ప్రయాణిస్తూ, కాలుష్య నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించారు. పెరుగుతున్న కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో సైకిళ్లను భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు. అంతేకాకుండా, ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతి పౌరుడూ కనీసం ఒక మొక్కనైనా నాటాలని చంద్రబాబు కోరారు. ముఖ్యమంత్రి స్వయంగా సైకిల్ తొక్కుతూ పర్యావరణ సందేశం ఇవ్వడం స్థానికులలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

