కలం, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు ( CM Chandrababu) నేడు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు క్యాంప్ కార్యాలయంలో సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతి రాజధాని పురోగతిపై చర్చించనున్నారు.
పార్టీ ముఖ్యనేతలతో భేటీ ..
నేడు సీఎం చంద్రబాబు టీడీపీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఈ క్రమంలో మహానాడు హైబ్రిడ్ విధానంలో జరిగిన తీరుపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. మహానాడు జరిగిన తీరు, భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తారు. అలాగే ప్రజల నుంచి వినతి పత్రాలను కూడా చంద్రబాబు స్వీకరిస్తారు.

