కలం, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు ( CM Chandrababu) నేడు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు క్యాంప్ కార్యాలయంలో సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతి రాజధాని పురోగతిపై చర్చించనున్నారు.
పార్టీ ముఖ్యనేతలతో భేటీ ..
నేటి సీఎం చంద్రబాబు షెడ్యూల్ లో టీడీపీ కార్యాలయానికి వెళ్లే పోగ్రామ్ కూడా ఉంది. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యి కీలక విషయాలపై చర్చించనున్నారు. మహానాడు హైబ్రిడ్ విధానంలో జరిగిన తీరుపై అడిగి తెలుసుకుంటారు. అలాగే భవిష్యత్ కార్యచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. తదనంతరం ప్రజల నుంచి వినతి పత్రాలకు సీఎం స్వీకరిస్తారని సమాచారం అందుతోంది.
Read Also: మారేడుమిల్లి అటవీ సిబ్బంది సేవలపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు
Follow Us On: Sharechat

