కలం, ఖమ్మం బ్యూరో: కొత్తగూడెం(Kothagudem) మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్(Congress) సీపీఐ (CPI) శ్రేణుల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. 19వ డివిజన్ రామవరం పోలింగ్ కేంద్రం(Ramavaram Polling Station) వద్ద బయటి వ్యక్తులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ.. కాంగ్రెస్, సీపీఐ కార్యకర్తలు ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగి కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్నది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, సీపీఐ నేత సబీర్ పాషా ఇరు వర్గాలకు సర్ది చెప్పి అక్కడి నుంచి బయటికి పంపించివేశారు. ప్రజలు ప్రశాంతంగా ఓట్లు వేయాలని, రామవరంలో రౌడీ ఇజానికి తావు లేదని భరోసా కల్పించారు.


