కలం, వెబ్ డెస్క్ : కిడ్నాప్ కేసులో నటుడు మోహన్ బాబు (Mohan Babu)కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో మోహన్ బాబు (Mohan Babu) పాత్రకు సంబంధించి తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. దీంతో ఈ వ్యవహారంలో బాధితుడి వాదనలను కూడా వినాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం తెలిపింది. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం తదుపరి నిర్ణయం వెలువరిస్తామని స్పష్టం చేస్తూ, కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.


