కలం, వెబ్ డెస్క్: దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పరీక్షల్లో ఒకటైన సివిల్స్ (Civil Services) ప్రిలిమ్స్ రేపు జరగబోతుంది. ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నగరాల్లో పరీక్ష నిర్వహించబోతున్నారు. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం జనరల్ స్టడీస్, మధ్యాహ్నం సీ–సాట్ పరీక్షలు జరగబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు లక్ష మందికి పైగా ఈ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అత్యంత కఠినంగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

