epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

చైనా నాటిన చెట్లు.. దేశంలో నీటిని పంపిణీనే మార్చేశాయ్..

కలం డెస్క్: China Water Cycle | నాలుగేళ్లుగా చైనా ఓ యుద్ధం చేస్తోంది. అదే ఎడారీకరణను అరికట్టడం. ఇందుకోసం ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసింది. వాటి ప్రకారం అడుగులు వేస్తూ ముందుకువెళ్తోంది. అందులో భాగంగా నాటిని చెట్లు ఇప్పుడు దేశంలో నీటి పంపిణీ వ్యవస్థనే మార్చేశాయి. ఎడారీకరణను అరికట్టేందుకు చేపట్టిన భారీ పచ్చదనం కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నీటి పంపిణీ వ్యవస్థపై ప్రగాఢ ప్రభావం చూపినట్టు తాజాగా ప్రచురించిన ఓ పరిశోధన వెల్లడించింది. చెట్లు పెరగడం వల్ల వర్షపాతం పెరిగిందని, కానీ ఇంకా కొన్ని కీలక ప్రాంతాల్లో నీరు అశించినంత స్థాయిలో అందుబాటులో లేదని శాస్త్రవేత్తలు చెప్పారు.

2001 నుంచి 2020 మధ్యకాలంలో వృక్షవృందం పెరగడంవల్ల చైనా భూభాగంలో 74% ఉన్న తూర్పు మాన్సూన్ ప్రాంతం, వాయువ్య ఎడారి ప్రాంతాల్లో మనుషులు, పర్యావరణ వ్యవస్థలకు అందుబాటులో ఉన్న నీటి పరిమాణం తగ్గిందని, అయితే అదే సమయంలో మిగతా భూభాగాన్ని కలిగి ఉన్న టిబెటన్ పీఠభూమిలో నీటి నిల్వ పెరిగిందని అక్టోబర్ 4న అర్త్’స్ ఫ్యూచర్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది.

“భూభాగ కవర్ మార్పులు నీటిని తిరిగి పంపిణీ చేస్తాయి,” అని పరిశోధన సహ రచయిత, నెదర్లాండ్స్‌లోని ఉట్రెక్ట్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆరీ స్టాల్ తెలిపారు. “గత కొన్ని దశాబ్దాల్లో చైనా విస్తారంగా రీ-గ్రీనింగ్ చేపట్టింది. ముఖ్యంగా లోయెస్ పీఠభూమిలో వారు పెద్ద ఎత్తున పునరుద్ధరణ చేశారు. దీని వల్ల నీటి చక్రం(China Water Cycle) మళ్లీ చురుకైంది” అని చెప్పారు.

పచ్చదనం ప్రాజెక్ట్‌లు

చైనా 1978 నుంచి “గ్రేట్ గ్రీన్ వాల్” వంటి గొప్ప పునరావరణ కార్యక్రమాలు, అలాగే “గ్రైన్ ఫర్ గ్రీన్, నేచురల్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్” వంటి పథకాలను అమలు చేస్తోంది. 1949లో చైనాలో పచ్చదనం 10శాతం మాత్రమే ఉంది. ప్రస్తుతం అది సుమారు 25శాతానికికి పెరిగింది. ఇది అల్జీరియా పరిమాణంతో సమానమైన అడవి విస్తీర్ణం. ఇతర పెద్ద రీగ్రీనింగ్ (Re Greening) ప్రాజెక్టులకు “గ్రైన్ ఫర్ గ్రీన్ ప్రోగ్రామ్”, “నేచురల్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్” ఉన్నాయి. రైతులు వ్యవసాయ భూమిని అరణ్యంగా మార్చేందుకు ప్రోత్సాహకాలు, సహజ అడవుల్లో చెట్ల నరికివేత నిషేధం వంటి చర్యలు ఇవి.

వర్షపాతంలో వచ్చిన మార్పులు

పెద్ద ఎత్తున వృక్షాల పెంచడం వల్ల ఎవాపోట్రాన్స్‌పిరేషన్ (Evapotranspiration) సంభవించింది. అంటే మొక్కలు, నేల నుంచి ఆవిరీభవనం భారీగా పెరిగింది. దీని ఫలితంగా వాతావరణంలో తేమ పెరిగి వర్షపాతం కూడా పెరిగింది. చైనా దేశవ్యాప్తంగా చేపట్టిన పర్యావరణ పునరుద్ధరణ కార్యక్రమాలు 2000–2017 మధ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఆకురాలు ప్రాంతం (leaf area) లో 25% కు కారణమయ్యాయి.

అయితే ఈ రీగ్రీనింగ్ చైనా వాటర్ సైకిల్‌ను భారీగా మార్చేసింది. ఇవాప్‌ట్రాన్స్‌పిరేషన్, వర్షపాతం రెండూ పెరిగాయి. ఈ ప్రభావాలను అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు హై-రెజల్యూషన్ ఇవాప్‌ట్రాన్స్‌పిరేషన్, వర్షపాతం, భూవినియోగ మార్పుల డేటాను, ఒక వాతావరణ ఆర్ద్రత ట్రాకింగ్ మోడల్‌ను ఉపయోగించారు.

పరిశోధనలో ఇవాప్‌ట్రాన్స్‌పిరేషన్ వర్షపాతాన్ని మించి పెరిగిందని, దీని వల్ల కొంత నీరు తిరిగి వాతావరణంలోనే ఉండిపోయిందని తేలింది. గాలులు నీటిని 7,000 కి.మీ దూరం వరకు తరలించగలవు, అందువల్ల ఒక ప్రాంతంలో జరిగే ఇవాప్‌ట్రాన్స్‌పిరేషన్ మరో ప్రాంతంలోని వర్షపాతాన్ని ప్రభావితం చేస్తుంది.

తూర్పు మాన్సూన్ ప్రాంతంలో అడవుల విస్తరణ, మిగతా ప్రాంతాల్లో గడ్డి భూముల పునరుద్ధరణ ఇవాప్‌ట్రాన్స్‌పిరేషన్‌ను పెంచాయి. కానీ వర్షపాతం పెరగడం మాత్రం టిబెటన్ పీఠభూమి ప్రాంతానికే పరిమితం అయింది. దీనివల్ల ఇతర ప్రాంతాలు నీటి కొరతను ఎదుర్కొన్నాయి. ఈ పరిస్థితి చైనాలో నీటి నిర్వహణపై పెద్ద ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే నీటి పంపిణీ దేశంలో అసమానంగా ఉందని స్టార్ట్ తెలిపారు.

రీగ్రీనింగ్‌ వల్ల సృష్టమైన నీటి పునర్వ్యవస్థీకరణను పరిగణనలోకి తీసుకోకుండా ఎలాంటి నీటి ప్రణాళికలు రూపొందించినా అవి విఫలమయ్యే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. ఇలాంటి పర్యావరణ పునరుద్ధరణ కార్యక్రమాలు ఇతర దేశాల్లో కూడా నీటి చక్రాన్ని మారుస్తున్న అవకాశముందని స్టాల్ తెలిపారు. “నీటి వనరుల దృష్టితో చూస్తే, ప్రతి ప్రాంతాన్ని వేరుగా పరిశీలించాలి. ఎక్కడ ఇవాప్‌ట్రాన్స్‌పిరేషన్ జరిగి, ఎక్కడ వర్షపాతం రూపంలో తిరిగి పడుతుందన్నదే కీలకం” అని ఆయన అన్నారు.

Read Also: అనంత్ అంబానికి అరుదైన గౌరవం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>