కలం, వెబ్డెస్క్: తూర్పు చైనా సముద్రంలో మళ్ళీ టెన్షన్ నెలకొంది. ‘జస్టిస్ మిషన్ 2025’ పేరుతో తైవాన్ చుట్టూ చైనా వార్ డ్రిల్స్ (China Vs Taiwan) మొదలుపెట్టింది. సోమవారం తైవాన్ జలసంధిలో భారీ స్థాయిలో యుద్ధ విన్యాసాలు మొదలుపెట్టింది. చైనా ఎయిర్ఫోర్స్, నేవీ, రాకెట్ ఫోర్స్ దళాలు తైవాన్ సమీపంలో డ్రిల్స్ ప్రారంభించాయి. శత్రువు నుంచి సముద్రం, ఆకాశం ద్వారా వచ్చే ముప్పులు ఎదుర్కోవడానికి ఈ యుద్ధ విన్యాసాలు చేస్తున్నట్లు చైనా చెబుతోంది. మరోవైపు చైనా దుందుడుకు చర్య తమకు ముప్పుగా పరిణమించిందని తైవాన్ ఆందోళన చెందుతోంది. చైనా ఇలా దూకుడుగా వ్యవహరించడానికి కారణం అమెరికా, జపాన్ చేసిన ప్రకటనలు కారణం కావడం గమనార్హం.
తనను తాను కాపాడుకునేందుకు తైవాన్కు 11బిలియన్ డాలర్ల ఆయుధాలు విక్రయిస్తామని ఇటీవల అమెరికా ప్రకటించింది. దీనికితోడు ఆదివారం జపాన్ ప్రధాని తకాయిచి సనాయె చేసిన వ్యాఖ్యలు చైనా కోపానికి మరింత ఆజ్యం పోశాయి. తైవాన్ను రక్షించేందుకు అవసరమైతే తాము రంగంలోకి దిగుతామని జపాన్ ప్రధాని అనడం చైనాకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. అందుకే ఉన్నట్టుండి ఇలా తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలకు దిగినట్లు తెలుస్తోంది. కాగా, తైవాన్ తాము స్వతంత్ర దేశమని చెబుతుండగా, లేదు మా దేశంలో భాగమని చైనా అంటోంది. తైవాన్ను అమెరికా సహా వివిధ దేశాలు అండగా ఉండడం బీజింగ్ సహించలేకపోతోంది. అందుకే, తైవాన్ను భయపెట్టేలా డ్రిల్స్ (China Vs Taiwan) చేపట్టినట్లు తెలుస్తోంది.
Read Also: గాలిలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు
Follow Us On : WhatsApp


