epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

శంషాబాద్‌లో రెండు విమానాల‌కు బాంబు బెదిరింపు

క‌లం వెబ్ డెస్క్ : శంషాబాద్‌(Shamshabad)లోని రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్రయానికి(RGIA) మ‌రోసారి బాంబు బెదిరింపు(Bomb Threat) రావ‌డం క‌ల‌కలం రేపింది. ఆదివారం ఉద‌యం జెడ్డా, కొచ్చి నుంచి శంషాబాద్ వ‌స్తున్న రెండు ఇండిగో విమానాల్లో(Indigo Flights) ఆర్డీఎక్స్(RDX) అమ‌ర్చిన‌ట్లు మెయిల్ ద్వారా దుండ‌గులు బెదిరింపులు చేశారు. దీంతో అధికారులు రెండు విమానాల‌ను శంషాబాద్‌లో నిలిపి ప్ర‌యాణికుల‌ను దింపి బాంబ్ స్క్వాడ్‌తో త‌నిఖీలు చేప‌ట్టారు. మ‌రోవైపు కోల్‌క‌తా నుంచి శంషాబాద్ వ‌స్తున్న ఓ విమానంపై లేజ‌ర్ లైట్ ప‌డ‌టం ఆందోళ‌న క‌లిగించింది. ఏటీసీ పైల‌ట్ గ‌మ‌నించి అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. అధికారులు దీనిపై విచార‌ణ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>