కలం, డెస్క్ : కర్ణాటకలో ఏపీ వాసులకు ఘోర ప్రమాదం (Karnataka Accident) జరిగింది. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె నుంచి రోజువారీ కూలీలు ఆదివారం శ్రీనివాసపురానికి చింతకాయలు కోయడానికి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో శ్రీనివాసపురం వద్ద వారు వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. 15 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Read Also: షాకింగ్.. పార్క్ చేసిన కారులో మూడు మృతదేహాలు
Follow Us On : WhatsApp


