కలం, డెస్క్ : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వేళ విషాదం నెలకొంది. మంచిర్యాల (Mancherial) మున్సిపాలిటీ 10వ వార్డు లక్షెట్టిపేట బీజేపీ అభ్యర్థి బత్తిని ఎల్లమ్మ మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఈ రోజు ఉదయం కన్నుమూశారు. దీంతో లక్షెట్టిపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి పట్ల బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు అధికారులు.
Read Also: బోణీ కొట్టిన బీఆర్ఎస్.. ఆ మున్సిపాలిటీ కైవసం
Follow Us On: X(Twitter)


