సెక్రటేరియట్ వద్ద యువకుడి బైక్​ స్టంట్స్.. పోలీసులు ఏం చేశారంటే?

కలం, వెబ్ డెస్క్​ : సోషల్​ మీడియా వచ్చిన నాటి నుంచి కొందరు ఫేమస్​ కావడానికి తెగ రీల్స్ చేస్తున్నారు. కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నిషేదిత ప్రదేశాల్లో, ప్రాంతాల్లో తమ ట్యాలెంట్​ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సెక్రటేరియట్ (Telangana Secretariat) సమీపంలో ఓ వ్యక్తి ఇన్​ స్ట్రా గ్రామ్​ రీల్స్​ తీయడంతో అతన్ని పోలీసులు అరెస్ట్​ చేశారు. లుంబినీ పార్క్​, సచివాలయం సమీపంలో ప్రమాదకరంగా బైక్​ స్టంట్స్​ చేస్తున్న ఇబ్రహీం బేగ్​ (23) అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి బైక్​, మొబైల్​ ఫోన్​ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రీల్స్​ చేసేవారికి పోలీసులు హెచ్చరించారు. పబ్లిక్​ ప్రాంతాల్లో నిర్లక్ష్యంగా స్టంట్స్​ చేస్తూ ప్రజల భద్రతకు ముప్పు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read Also: కరీంనగర్‌‌లో భారీ బ్యాంకింగ్ స్కాం.. 130 కోట్ల మోసం

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>