కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు రేపటి (సోమవారం) నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను (Shiv Pratap Shukla) ప్రభుత్వం ఆహ్వానించింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల (Telangana Assembly) ను ఉద్దేశించి ప్రసంగించాలని గవర్నర్ ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గవర్నర్ కు భట్టి సత్కరించారు. డిప్యూటీ సీఎం వెంట ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఫైనాన్స్–ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, ఆర్థిక శాఖ కార్యదర్శి స్కితా పట్నాయక్ తదితరులు ఉన్నారు.
కాగా, మార్చి 16న గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నాయి. 20వ తేదీన తెలంగాణ బడ్జెట్ ను ప్రభుత్వం శాసన సభ (Telangana Assembly)లో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనుండగా, మార్చి 30 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Read Also: డ్రగ్స్ కేసు.. పైలట్ రోహిత్ రెడ్డికి రిమాండ్ విధించిన కోర్టు
Follow Us On : WhatsApp

