కలం, వెబ్ డెస్క్ : కరీంనగర్ కార్పొరేషన్ (Karimnagar Corporation) లో బీజేపీకి అధిక సీట్లు రావడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆనందం వ్యక్తం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ లో గెలవడం గొప్ప విషయం అని, రాబోయే ఐదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. ఈ సంతోషం పట్టలేకపోతున్నారన్నారు. ఓ లక్ష్యాన్ని ఎంచుకుని దాని ప్రకారం కలిసి పని చేసినట్లు తెలిపారు. ‘బండి సంజయ్ కరీంనగర్ కు ఎన్ని నిధులు తీసుకువచ్చాడు.. ఏం చేశారు’ అని ప్రశ్నించిన వారికి ప్రజలు గట్టి దెబ్బ కొట్టారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవసరం లేదని.. కరీంనగర్ లో బీజేపీకి మద్దతు తెలిపారని బండి పేర్కొన్నారు. గెలుపు కేవలం రాజకీయం కాదని, ప్రజలు తమపై గురుతర బాధ్యత పెట్టారన్నారు. ఉచిత హామీలు, ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వకున్నా ప్రజలకు తమపై ఉన్న విశ్వాసంతో గెలిపించారని బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు.
Read Also: ఆ జిల్లాలో బీజేపీ కింగ్మేకర్
Follow Us On: X(Twitter)


