కలం, వెబ్ డెస్క్ : గ్యాస్ కొరత ఆఖరకు అయోధ్య (Ayodhya Temple) రాముడి ఆలయాన్ని కూడా తాకింది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్ వల్ల ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో గ్యాస్ కొరత వచ్చింది. హోటళ్లు, దాబాలు మూసేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అయోధ్య ఆలయం (Ayodhya Temple) కూడా కీలక ప్రకటన చేసింది. ఎల్పీజీ గ్యాస్ కొరత వల్ల ఆలయంలో ఉచిత ప్రసాదాలు, అన్నదానాలు నిలిపివేస్తున్నట్టు తెలిపారు ఆలయ నిర్వాహకులు. ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలంటూ కోరుతున్నారు.

