కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా సైబరాబాద్ మున్సిపల్ పరిధిలోని అమీన్పూర్(Ameenpur)లో మరోసారి అధికారులు కూల్చివేతలు చేపట్టారు. 993 సర్వే నెంబర్లోనీ ప్రభుత్వ భూముల్లో పలు అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు అధికారులు గుర్తించి కూల్చివేతలు మొదలుపెట్టారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మించిన ఇండ్లను, కట్టడాలను కూల్చేసినట్టు అధికార యంత్రాంగం తెలిపింది. ప్రభుత్వ భూముల్లో కబ్జాలు చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వారు హెచ్చరించారు. ఆక్రమణదారులుపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: పెళ్లిలో ఇదో కొత్త ట్రెండ్.. ఈ హైటెక్ మర్యాదలు చూస్తే షాక్!
Follow Us On: Instagram

