కలం, వెబ్ డెస్క్ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి (Atal Bihari Vajpayee) శతజయంతి ఉత్సవాల్లో భాగంగా అటల్-మోడీ సుపరిపాలన యాత్రను బీజేపీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఈ నెల 11న మొదలైన ఈ యాత్ర 25వ తేదీ వరకు జరగబోతోంది. ఈ యాత్ర రేపు కాకినాడకు(Kakinada) రాబోతుంది. ఈ సందర్భంగా కాకినాడలో వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. దీనికి బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ తో పాటు కూటమి ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఈ యాత్రలో భాగంగా అన్ని జిల్లాల్లో కాంస్య విగ్రహాలు ఆవిష్కరించేందుకు బీజేపీ సిద్ధమైంది.
Read Also: రైలు నుంచి కిందపడి దంపతుల మృతి కేసులో ట్విస్ట్
Follow Us On : WhatsApp


