కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) APPECET–2026 ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా విజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ఫలితాలలో మొత్తం ఉత్తీర్ణత శాతం 89.76% గా నమోదైంది. 4,037 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 2,958 మంది పరీక్షకు హాజరయ్యారు. 2,655 మంది అర్హత సాధించారు. అందులో 1,993 మంది పురుషులు (92.91%) అర్హత సాధించగా, 662 మంది మహిళలు (81.43%) ఉత్తీర్ణత సాధించారు.
ఈ ఫలితాలతో ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ రంగంలో కెరీర్ను నిర్మించుకోవాలని ఆశిస్తున్న అభ్యర్థులు మరో కీలక దశను పూర్తి చేసినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. భవిష్యత్తులో వారు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్(https://cets.apsche.ap.gov.in/PECET/) ద్వారా చూసుకోవచ్చని, ర్యాంక్ కార్డులు కూడా అదే ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అదనంగా ‘మన మిత్ర’ వాట్సాప్ (9552300009) ద్వారా కూడా ఫలితాలను పొందే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.
Read Also: ఏపీ ప్రభుత్వానికి వైసీపీ అధినేత జగన్ అల్టిమేటం
Follow Us On: X(Twitter)

