కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్పందించారు. రాష్ట్రంలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో నెలకొన్న ‘హంగ్’ పరిస్థితులపై ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తమిళనాడులో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదని, ఈ క్రమంలో గవర్నర్ అక్కడి రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాల్సి ఉంటుందన్నారు. తదుపరి పరిణామాలు గవర్నర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయని చంద్రబాబు కామెంట్ చేశారు.

