కలం, వెబ్ డెస్క్ : యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు (UPI Charges) విధిస్తారనే చర్చల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవని క్లారిటీ ఇచ్చింది. వ్యాపారులపై కూడా ఎలాంటి భారం ఉండబోదని స్పష్టం చేసింది.
ఇన్నిరోజులు ఉచితంగా ఉన్న యూపీఐ లావాదేవీలపై ఇక నుంచి ఛార్జీలు వసూలు చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో యూపీఐ యూజర్స్ లో అనుమానాలు నెలకొంది. మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలు విధిస్తారనే ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన చేసింది.

