కలం, వెబ్ డెస్క్ : ఏపీ గవర్నమెంట్ (Andhra Pradesh) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ కుటుంబ వివరాలను సేకరించి, సంక్షేమ పథకాలు, ప్రజా ప్రయోజన కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
ప్రత్యేక మొబైల్ యాప్ సహాయంతో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు, నివాస పరిస్థితులు, ఆదాయం, ఉపాధి, విద్య, ఆరోగ్యం వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేస్తారు. సర్వే ద్వారా ప్రజలకు అవసరమైన పథకాలు, లబ్ధిదారుల వివరాలు తెలుస్తాయి.


