Mobile Popup Ad
Mobile Popup Ad

మ‌హిళ‌తో అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌.. పోకిరీని అరెస్ట్ చేసిన పోలీసులు

క‌లం, వెబ్ డెస్క్‌: హైదరాబాద్‌ పరిధిలోని అల్కాపూర్ టౌన్‌షిప్‌ (Alkapoor Township)లో సంచలనం సృష్టించిన మహిళ వేధింపుల కేసును నార్సింగి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. రోడ్డుపై వెళ్తున్న ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి పరారైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు తన రెండున్నరేళ్ల చిన్నారితో కలిసి నడుచుకుంటూ ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో, నిందితుడు ఆమెను వెంబడించాడు. ఒంటరిగా ఉన్న మహిళను చూసి వెనుక నుండి వచ్చి, ఆమె దుస్తులను పైకి లేపి అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఊహించని పరిణామానికి షాక్‌కు గురైన బాధితురాలు వెంటనే ధైర్యంతో అతడిని పట్టుకోవడానికి వెంబడించినప్పటికీ, నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు.

ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.అవి కాస్తా సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారడం తీవ్ర కలకలం రేపింది. దీనిపై రంగంలోకి దిగిన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజీని నిశితంగా పరిశీలించి, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించారు. నిందితుడిని పుప్పాలగూడకు చెందిన వడ్డే నాగరాజు (26)గా నిర్ధారించి, ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే అతడిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. మహిళల భద్రతకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా పోలీసులు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>