కాగ‌జ్‌న‌గ‌ర్‌లో ఎంఐఎం అభ్య‌ర్థి మిస్సింగ్‌..కేసు న‌మోదు

క‌లం, వెబ్ డెస్క్‌: మున్సిప‌ల్ చైర్మ‌న్లు, మేయ‌ర్ల ఎన్నిక‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఆయా పార్టీల నేత‌లు గెలుపొందిన త‌మ అభ్య‌ర్థుల‌తో క‌లిసి క్యాంపుల నుంచి ప‌ట్ట‌ణాల‌కు బ‌య‌లుదేరారు. ఈ త‌రుణంలో కాగ‌జ్‌న‌గ‌ర్ (Kagaznagar) మున్సిపాలిటీలో ఎంఐఎం అభ్య‌ర్థి క‌నిపించ‌డం లేదంటూ మిస్సింగ్ కేసు న‌మోదైంది. కాగజ్‌నగర్ మునిసిపాలిటీలోని వార్డు నెంబర్ 3లో విజయం సాధించిన తమ అభ్యర్థి అలియా బేగం మూడు రోజుల నుండి కనిపించడం లేదని ఎంఐఎం పార్టీ నేత‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేప‌ట్టారు.

Read Also: ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ‘టగ్ ఆఫ్ వార్’.. పై చేయి ఎవరిది?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>