కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) లో ఏసీబీ అధికారులు దాడులు చేసి.. సోదాలు నిర్వహిస్తున్నారు. ఫైల్స్ స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. ఏసీబీ దాడులతో వివిధ శాఖలలో ఒక్కసారిగా గుబులు మొదలైంది. ఏ శాఖలో ఎవరి మీద ఆరోపణలు వచ్చాయి.. లేదా ఎవరైనా లంచం తీసుకుంటూ పట్టుబడ్డారా అనేది తెలియాల్సి ఉంది. ఏసీబీ అధికారులు బయటకు వచ్చాక పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. ఏసీబీ సోదాలతో ఒక్కసారిగా కామారెడ్డి మున్సిపాలిటీ లో కలకలంగా మారింది.
Read Also: ఫస్ట్ టైమ్ హిందీలో స్పీచ్.. గవర్నర్ కొత్త ట్రెండ్
Follow Us On: X(Twitter)

