epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ధోనీకి రూల్స్ వర్తించవా?

కలం, వెబ్​డెస్క్​: టీమిండియా మాజీ కెప్టెన్​, మిస్టర్​ కూల్​ మహేంద్ర సింగ్​ ధోని (Dhoni) వివాదంలో చిక్కుకున్నాడు. ఎయిర్​పోర్ట్​ తనిఖీ కేంద్రం వద్ద చేతి గడియారం, ఫిట్నెస్​ డివైజ్ తీయకుండానే మెటల్​ డిటెక్టర్​ గుండా విమానాశ్రయం లోపలికి వెళ్లాడు. వాస్తవానికి వాటిని తీసి స్కానర్​ టేబుల్​పై పంపాలి. అయితే, తన భుజానికి ఉన్న బ్యాగును మాత్రం స్కానర్​ టేబుల్​పై పెట్టిన ధోని.. వాచ్​, ఫిట్నెస్​ డివైజ్​ తీయలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో విమానాశ్రయ భద్రతా సిబ్బంది, ఎయిర్​పోర్ట్​ అధికారుల తీరుపై విమర్శలు చెలరేగాయి. ధోనీకి రూల్స్ వర్తించవా? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధించారు.

సామాన్యులెవరైనా వెళితే తమ వస్తువులన్నీ తీసి, స్కానర్​లో పెట్టేంతవరకు విమానాశ్రయ అధికారులు లోపలికి అనుమతించరని, అలాంటిది ధోని (Dhoni) ని ఎలా పంపించారని అడుగుతున్నారు. విమానాశ్రయాల్లో వీఐపీ కల్చర్​ ఏంటని ఎయిర్​పోర్ట్​ భద్రతా సిబ్బందిని, కేంద్ర విమానయాన శాఖను ట్యాగ్​ చేస్తూ ట్వీట్ల ద్వారా ప్రశ్నిస్తున్నారు. కొందరు ధోని తీరును సైతం తప్పుపట్టగా, మరికొందరు మద్దతుగా మాట్లాడుతున్నారు. ధోని దేశం పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి అని, ఆర్మీలో ఆఫీసర్​ హోదా ఉందని గుర్తుచేస్తున్నారు. మెటల్​ డిటెక్టర్​ దాటిన తర్వాత పోలీసుల తనిఖీకి సహకరించింది వీడియోలో గమనించాలని చెప్తున్నారు.

Read Also: KKR ముస్తాఫిజుర్ బిడ్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>