కలం, వెబ్ డెస్క్ : ఫుట్ బాల్ దిగ్గజం లియొనల్ మెస్సి గత కొద్ది రోజుల క్రితం ఇండియా గోట్ టూర్(Goat India Tour) లో భాగంగా హైదరాబాద్ లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సింగరేణి ఆర్ఆర్ టీమ్ తరఫున పాల్గొంటే అపర్ణ టీమ్ తరఫున మెస్సీ ఆడాడు. మ్యాచ్ అనంతరం రేవంత్ రెడ్డి తన మనవడితో గ్రౌండ్ లో మెస్సీ (Lionel Messi) తో పాటు ఆడించాడు. ఫోటోలు కూడా దిగారు. అయితే, దీనిపై బీఆర్ఎస్ (BRS) తీవ్రస్థాయిలో మండిపడింది. గతంలో కేసీఆర్ (KCR) మనవడిపై రేవంత్ రెడ్డి కామెంట్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ విమర్శలు చేశారు. అలాగే, మెస్సీ మ్యాచ్ కోసం ప్రజా ధనాన్ని వృథా చేశారని ఆరోపించారు.
కాగా, ఈ కామెంట్లపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. గురువారం తన నివాసంలో జరిగిన మీడియా సమావేశం అనంతరం పాత్రికేయులతో చిట్ చాట్ చేశారు. మెస్సీ మ్యాచ్ కు తన మనవడిని ఫుట్ బాల్ ఆడడం కోసం తీసుకెళ్లానని, కానీ, కేసీఆర్ ఫ్యామిలీ లాగా పబ్బులు, గబ్బుల చుట్టూ తిప్పడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. మెస్సీ పర్యటన పూర్తి ప్రైవేట్ కార్యక్రమం అని దానికి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే, తాను కూడా కేవలం గెస్టులాగే వెళ్లానన్నారు. సింగరేణి యాజమాన్యం అడ్వర్టైస్ మెంట్ కోసం రూ.10 కోట్లు ఇచ్చిందని తెలిపారు. కేసీఆర్ ను ఆయన కొడుకే బయటకు తీసుకువస్తున్నాడని.. తాను కేసీఆర్ ను ఓడించే ముఖ్యమంత్రి అయ్యానని రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పారు.
Read Also: ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి గ్లోబల్ టెండర్లు
Follow Us On: Youtube


