epaper
Friday, January 16, 2026
spot_img
epaper

రవీంద్రభారతిలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ

కలం, వెబ్​డెస్క్​: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని (SPB Statue) రవీంద్రభారతి ప్రాంగణంలో సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో బాలు కుటుంబ సభ్యులతోపాటు మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్​ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్​ బాబు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్​రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. విగ్రహాన్ని తూర్పుగోదావరి జిల్లాలో తయారుచేయించారు. 7.2అడుగుల ఈ విగ్రహాన్ని కాంస్యంతో రూపొందించారు. కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. ఎస్పీబీకి ఇష్టమైన పాటలను సాయంత్రం 50 మంది గాయకులు ఆలపించనున్నారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఢిల్లీలో ఉండడం వల్ల విగ్రహావిష్కరణకు హాజరుకాలేకపోయారు.

Read Also: కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన తిలక్ వర్మ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>