కలం, వెబ్ డెస్క్: వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రతిరోజు తిరుమల తిరుపతికి (Tirumala) ఎంతోమంది భక్తులు వస్తుంటారు. స్వామి దర్శనంతోపాటు తిరుమలలోని ఇతర ఆలయాలను సందర్శించుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. తిరుమలలోని శ్రీభూ వరాహ స్వామి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో వరాహ స్వామి ఆలయం వేళలో మార్పులు చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. గతంలో ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులకు స్వామి వారి దర్శనం ఉండేది. ఇకపై ప్రతి రోజు ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు దర్శనం పొడిగిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
Read Also: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీసీ పోరుబాట
Follow Us On: X(Twitter)


