కలం, వెబ్ డెస్క్ : తీహార్ జైలు (Tihar Jail) అంటే తెలియని వారుండరు.. దేశంలోని కారాగారాల్లో ఈ జైలుకు చాలా ప్రత్యేకత ఉంది. దక్షిణ ఆసియాలో అతిపెద్ద కారాగారంగా ప్రసిద్ధి చెందిన ఈ జైలు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. తీహార్ జైలును ఢిల్లీ శివార్లకు తరలించేందుకు ఢిల్లీ ప్రభుత్వం (Delhi Government) ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా (Rekha Gupta) ఈ విషయాన్ని శనివారం వెల్లడించారు. ఇండియా లా ఫిర్మ్స్ సొసైటీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జైలులో ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సౌకర్యాలు సరిపోవడం లేదన్నారు. ఖైదీల భద్రతా, మౌలిక సదుపాయాలు కల్పనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం రేఖా గుప్త వెల్లడించారు.
Read Also: తెలుగు ఇండస్ట్రీలో ఐక్యత లేదు: తమన్
Follow Us On: Sharechat


