నేడు తుమ్మెనపేటకు విజయ్-రష్మిక దంపతులు

కలం, సినిమా : విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న( Rashmika Mandanna) దంపతులు నేడు వారి స్వగ్రామం నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లాలోని బలమూరు మండలం  తుమ్మెనపేట (Thummanpet)కు రానున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. విజయ్ దేవరకొండకు చెందిన ఫామ్‌హౌస్‌లో ఇవాళ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నారు. వ్రతానికి కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయులు హాజరుకానున్నారు. అనంతరం ప్రత్యేక రిసెప్షన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో గ్రామంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అతిథుల స్వాగతం కోసం ప్రత్యేక అలంకరణలు, విందు ఏర్పాట్లు చేశారు. విజయ్-రష్మిక జంట రాకతో తుమ్మెనపేటలో సందడి వాతావరణం నెలకొంది. అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకునే అవకాశముండటంతో స్థానిక అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు.

Read Also: వాళ్ల‌ను ఇరాన్‌కు పంపేయండి.. నిర‌స‌న‌కారుల‌పై మోడీకి యాంక‌ర్ ర‌ష్మీ రిక్వెస్ట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>