కలం, వెబ్ డెస్క్ : ఫుట్ బాల్ దిగ్గజం లియెనల్ మెస్సీ (Lionel Messi) హైదరాబాద్ పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉప్పల్ స్టీడియంలో నిర్వహించే ఫ్రెండ్లీ మ్యాచ్ కు సంబంధించిన షెడ్యూల్ బయటకు వచ్చింది. రాత్రి 7.50 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు మెస్సీ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఉప్పల్ స్టేడియంకి వస్తారు. 8.06 నిమిషాలకు రేవంత్ రెడ్డి, 8.07కు మెస్సీ గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇస్తారు. 8.18 కి మైదానంలోకి రాహుల్ గాంధీ వస్తారు. మ్యాచ్ పూర్తైన తరువాత టీమ్ సభ్యులతో ఫోటో దిగుతారు.
అనంతరం చిన్నారులతో టికి–టాక్ కార్యక్రమం ఉంటుంది. 8.51 కి గెలిచిన టీమ్కు మెస్సీ ’గోట్ కప్‘ అందజేస్తారు. 8.54కి సీఎం రేవంత్ రెడ్డి.. లియోనల్ మెస్సీని సన్మానించి బహుమతి ప్రజెంట్ చేస్తారు. ఉప్పల్ స్టేడియంలోని కార్యమ్రం 9.10 నిమిషాలకు ముగుస్తుంది. కాగా, మెస్సీ(Lionel Messi) కల్ కతా పర్యటనలో చెలరేగిన ఉద్రిక్తత నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఉప్పల్ స్టేడియంతో పాటు మెస్సీ పర్యటించే చోట్ల కఠిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. స్టేడియం వద్ద 3000 మంది పోలీసులతో సెక్యూరిటీ పటిష్టం చేశారు.
Read Also: మెస్సీ టూర్ ఏర్పాట్లపై గవర్నర్ ఫైర్.. ఈవెంట్ ఆర్గనైజర్ అరెస్ట్
Follow Us On: Instagram


