Mobile Popup Ad
Mobile Popup Ad

జల్ జీవన్ మిషన్ పై కేంద్రంతో కీలక ఒప్పందం: సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్ర ప్రభుత్వంతో మంగళవారం ఏపీ ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఈ ఎంవోయూ కార్యక్రమమానికి కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ హాజరయ్యారు. ఆన్ లైన్ లో జూమ్ ద్వారా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pavan Kalyan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 2028 డిసెంబర్ నాటికి ‘హర్ ఘర్ జల్’ సాకారం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎంఓయూ కుదిరిందని చెప్పారు. దేశంలోని ప్రతి గ్రామాల్లో ఇంటింటికి సురక్షితమైన మంచినీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును కేంద్రం తీసుకువచ్చిందన్నారు.

కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ (CR Patil) మాట్లాడుతూ.. ఏపీలో జల్ జీవన్ మిషన్ (Jal Jeevan Mission 2.0) సాకారం అయ్యేందుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. ఎంతో కీలకమైన ఈ కార్యక్రమాన్ని పొడిగించాలని సీఎం చంద్రబాబు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. దీనిని ఏపీ పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆయన సూచించారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం మొదటి దశలో 16 కోట్ల మంది గృహాలకు నల్లాలు ఇచ్చామని వివరించారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>