కలం, వెబ్ డెస్క్ : మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ (Raja Saab) సినిమా పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాజాసాబ్ సినిమా జనవరి 9న రిలీజ్ కానుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేస్తున్నారు.
8వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 12 వరకు ప్రీమియర్ షోలకు అనుమతి వచ్చింది. ప్రీమియర్ కు ఏకంగా రూ.1000 ధర పెట్టుకోవచ్చని ఏపీ ప్రభుత్వం అనుమతించింది. 9వ తేదీ నుంచి పదిరోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ లో రూ.150, మల్టీప్లేక్స్ లో రూ.200 పెంచుకునేలా పర్మీషన్ ఇచ్చారు. అలాగే, మొదటి పది రోజులపాటు రోజుకు 5 షోలు వేసుకోవచ్చని జీవోలో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

Read Also: యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్లో రాజాసాబ్ జోరు
Follow Us On: X(Twitter)


