epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఈ నెల 18న మేడారానికి సీఎం రేవంత్​ రెడ్డి: సీతక్క

కలం, వెబ్​ డెస్క్​: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం (Medaram) సమ్మక్క సారలమ్మ. ఈ నెల 28 నుంచి 31 వరకు ఈ మహా జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. మేడారం ఏర్పాట్లు, జాతర నిర్వహణపై మంత్రి సీతక్క (Seethakka) బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18, 19 తేదీల్లో మేడారంలో సీఎం రేవంత్​ రెడ్డి పర్యటించనున్నట్లు ఆమె తెలిపారు. నూతనంగా నిర్మించిన గద్దెలు, ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు సీతక్క వెల్లడించారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో గద్దెల పునరుద్ధరణ జరిగిందని, ఆదివాసీలకే కాదు కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారం సమ్మక్క-సారలమ్మ అని సీతక్క అన్నారు. అందరి సహకారంతో అమ్మవార్ల జాతరను విజయవంతం చేస్తామన్నారు. మేడారం జాతర కోసం ప్రభుత్వం దాదాపు 100 కోట్లను మంజూరుచేసిందని మంత్రి సీతక్క గుర్తుచేశారు.

Seethakka
Revanth Reddy to Visit Medaram Jan 18th: Seethakka

Read Also: అసెంబ్లీకి బీఆర్ఎస్ పర్మినెంట్ గుడ్‌బై?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>