epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

వచ్చే వారం భారత్​కు జర్మనీ​ ఛాన్సలర్​

కలం, వెబ్​డెస్క్​: జర్మనీ ఛాన్సలర్​ ఫ్రెడరిక్​ మెర్జ్ (Friedrich Merz) వచ్చే వారం భారత పర్యటనకు రానున్నారు. రెండు రోజులపాటు దేశంలో పర్యటించనున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి 12న ఫ్రెడరిక్​ ప్రత్యేక విమానంలో గుజరాత్​లోని అహ్మదాబాద్​ నగరంలో దిగనున్నారు. ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత ఇద్దరూ సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపరిచే ప్రయత్నాల్లో భాగంగా అనేక కీలకాంశాలు చర్చిస్తారు.

ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఛాన్సలర్​ హోదాలో ఫ్రెడరిక్​ మెర్జ్​ భారత్​లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఆయన బెంగళూరునూ సందర్శిస్తారు. అమెరికా టారిఫ్​లు, హెచ్1బీ సమస్యలు ఇబ్బంది పెడుతున్న వేళ జర్మనీ ఛాన్సలర్​ భారత పర్యటనకు రావడం వ్యాపార, ఉద్యోగ, విద్యా రంగాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

Friedrich Merz
Friedrich Merz

Read Also: సిక్సర్లతో చెలరేగిన సూర్యవంశీ.. సిరీస్​ యువ భారత్​దే

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>