epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సిక్సర్లతో చెలరేగిన సూర్యవంశీ.. సిరీస్​ యువ భారత్​దే

కలం, వెబ్​డెస్క్​: ఫార్మాట్ ఏదైనా​.. వేదిక ఎక్కడైనా.. సీనియర్​, జూనియర్​ టోర్నీ అనే తేడా లేకుండా చెలరేగుతున్న వైభవ్​ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి ధనాధన్​ ఆటతో ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించాడు. దక్షిణాఫ్రికా అండర్​–19తో సోమవారం జరిగిన రెండో యూత్​ వన్డేలో సిక్సర్ల సునామీ సృష్టించి, యువ భారత్​కు విజయం సాధించిపెట్టాడు. దక్షిణాఫ్రికాలోని బెనోయ్​ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన యువ సఫారీ జట్టు 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌట్​ అయ్యింది. ఆ జట్టులో జేసన్​ రోవెల్స్​ సెంచరీ (114; 113 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్​లు) సాధించాడు. భారత బౌలర్లలో కిషన్​ కుమార్​ సింగ్​ 4, ఆర్​ఎస్​ అంబరీష్​ 2 వికెట్లు తీశారు. దీపేశ్​ దేవేంద్రన్​, కనిష్క్​ చౌహాన్​, ఖిలాన్​ పటేల్​ తలో వికెట్​ పడగొట్టారు.

ఛేదనలో వర్షం వల్ల ఆటకు అంతరాయం కలగడంతో లక్ష్యాన్ని 27 ఓవర్లలో 174 పరుగులకు కుదించారు. వైభవ్ సూర్యవంశీ సిక్సర్లతో వీరవిహారం చేసి అర్ధ సెంచరీ (68; 1 ఫోర్​, 10 సిక్స్​లు) సాధించడంతో భారత్​ 23.3 ఓవర్లలో 176/2 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అరోన్​ జార్జ్​(20), వేదాంత్​ త్రివేది(31 నాటౌట్​), అభిజ్ఞాన్​ కుందు(48) రాణించారు. మైఖేల్​ క్రూయిస్​కమప్​ 2 వికెట్లు తీశాడు. ఈ గెలుపుతో సిరీస్​ భారత్​ సొంతమైంది. ఆఖరి వన్డే ఇదే మైదానంలో జనవరి 7న జరగగనుంది.

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Read Also: ఫిబ్రవరిలో శిఖర్​ ధావన్​ పెళ్లి .. వధువు ఎవరంటే?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>