కలం, వెబ్ డెస్క్ : రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బీఆర్ఎస్ మళ్లీ నీళ్ల కుంపటి పెడుతున్నదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) అన్నారు. ఆదివారం గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా హరీశ్ రావు ఇవాళ ఉదయం తెలంగాణ నదీ అంశంపై బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని జగ్గారెడ్డి తప్పుబట్టారు.
బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పీపీటీ పెట్టారు.. అదే విషయంపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదని హరీశ్ రావును (Harish Rao) జగ్గారెడ్డి నిలదీశారు. కాళేశ్వరం కట్టాకే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతున్నట్టు బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ హయాంలోనే నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయని జగ్గారెడ్డి గుర్తు చేశారు.
అలాగే.. సింగూరు, మంజీరా డ్యామ్ లు కాంగ్రెస్ హయాలంలోనే నిర్మించారన్నారు. వీటి ద్వారానే హైదరాబాద్ ప్రజలకు తాగునీరు సరఫరా అయిందని తెలిపారు. జగన్, కేసీఆర్ మాట్లాడుకున్నప్పుడు బీఆర్ఎస్ వాళ్లకు జల దోపిడి గుర్తుకు రాలేదా.. ఇప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు కలిసి మాట్లాడుకుంటే తప్పా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

Read Also: తిండి, నీళ్లు లేవు.. వెనిజువెలాలో భయంకర పరిస్థితులు
Follow Us On : WhatsApp


