epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

తొలి వందే భారత్​ స్లీపర్ ఏ రూట్​లో అంటే..​

కలం, వెబ్​డెస్క్​: వేగం, సౌకర్యం కలగలిపి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రైళ్లు వందే భారత్​. ఇప్పుడు ఈ రైళ్లు మరో కొత్త రూపంలో పరుగులు పెట్టనున్నాయి. ఇప్పటి వరకు వీటిలో కేవలం కూర్చొని మాత్రమే ప్రయాణించే వీలుండగా, సుదూర ప్రాంతాలకు అనుగుణంగా బెర్త్​లతో కూడిన వందే భారత్​ స్లీపర్​ (Vande Bharat Sleeper)​ రైళ్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. తొలి వందే భారత్​ స్లీపర్​ రైలు కోల్​కతా – గువాహటి మధ్య ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ (Ashwini Vaishnaw)​ గురువారం వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ రైలు మరో 20 రోజుల్లోగా ప్రారంభమమవుతుందని తెలిపారు.

ప్రస్తుతం కోల్​కతా–గువాహటి మధ్య విమాన ప్రయాణానికి టికెట్​ రూ.6వేలు ఉండగా, వందే భారత్​ స్లీపర్​(Vande Bharat Sleeper) లో మీల్స్​తో కలపి థర్డ్​ ఏసీలో రూ.2300, సెకండ్​ ఏసీలో రూ.3వేలు, ఫస్ట్​ ఏసీలో రూ.3,600 ఉండొచ్చని చెప్పారు. కాగా, ఇప్పటికే వందే భారత్​ స్లీపర్ ట్రైన్​​ టెస్ట్​ రన్​ విజయవంతంగా పూర్తయ్యింది. కోటా(రాజస్థాన్​), నాగ్దా(మధ్యప్రదేశ్​) మధ్య గరిష్ఠంగా 180 కి.మీ వేగంతో జర్నీ చేసింది. రైలు గరిష్ఠ వేగంతో వెళుతుండగా నీళ్లు నింపిన గ్లాస్​లను ఒకదానిపై ఒకటి ఉంచినా అందులోని నీళ్లు తొణకలేదని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్​ తన ‘ఎక్స్​’ అకౌంట్​లో పోస్ట్​ చేశారు. 16 బోగీల వందే భారత్​ స్లీపర్​లో మోడ్రన్​ బెర్త్​లు, సప్పెన్షన్​ సిస్టమ్​, టాయిలెట్స్​, నిప్పును గుర్తించే వ్యవస్థ, సీసీ కెమెరాలు ఉన్నాయి.

Read Also: డ్రగ్స్ తీసుకుని డీజే ఆపరేట్.. ఐదుగురి అరెస్ట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>