కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో మరో అమానుష ఘటన జరిగింది. నార్సింగి (Narsingi) ప్రాంతంలో ఆరేళ్ల బాలికపై మానవ రూపంలో ఉన్న ఓ మృగం అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. చాక్లెట్ ఇప్పిస్తానని తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. నిన్న సాయంత్రం నుంచి బాలిక ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించగా.. ఓ వ్యక్తి బాలికను తీసుకెళ్తున్నట్లు గుర్తించారు.
నిందితుడిని పట్టుకుని విచారించగా నిజం ఒప్పుకుని బాలిక మృతదేహాన్ని చూపించాడు. అరెస్టు చేసిన పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. ఈ అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాగా, గతంలోనూ నార్సింగి (Narsingi) ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

