కలం, వెబ్ డెస్క్ : కర్ణాటకలోని బాగేపల్లి (bagepalli Karnataka) ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెనుకనుంచి వచ్చిన కంటైనర్ లారీ ఆటోను బలంగా ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగేపల్లి టౌన్ శివారులోని గంగోత్రి పెట్రోల్ బంక్ సమీపంలో తమ పనులు ముగించుకున్న కూలీలు ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఆటోను బలంగా ఢీ కొట్టింది. దీంతో భారీ శబ్ధం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

