కలం, వెబ్డెస్క్: నక్సలైట్లకు మరో భారీ ఎదురుదెబ్బ. ఛత్తీస్గఢ్లో శనివారం 51 మంది నక్సల్స్ ఆయుధాలతో సహా లొంగిపోయారు(Maoists Surrender ). ఈ మేరకు బస్తర్ ఐజీ సుందర్రాజ్ పట్టిలింగం వివరాలు వెల్లడించారు. లొంగిపోయినవాళ్లపై రూ.1.61కోట్లు రివార్డు ఉన్నట్లు ఆయన తెలిపారు. అలాగే వీళ్లలో 34 మంది మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. 30 మంది బీజాపూర్ జిల్లా కేంద్రంలో, మరో 21 మంది సుక్మా జిల్లాలో లొంగిపోయినట్లు ఆయన చెప్పారు.
నక్సల్స్ను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు అమలుచేస్తున్న ‘పూనా మార్గం’ పునరావాసం కార్యక్రమంలో భాగంగా వీళ్లు లొంగిపోయినట్లు ఆయన వెల్లడించారు (Maoists Surrender ). దేశాన్ని ఈ ఏడాది మార్చి 31 నాటికి నక్సల్స్ రహితంగా చేయాలనే కేంద్రం ప్రయత్నాల్లో ఇది మరొక భారీ విజయమని ఆయన అన్నారు. కాగా, ఛత్తీస్గఢ్లో గిరిజనుల పండుగ అయిన ‘బస్తర్ పందుం 2026’ వేడుకల్లో పాల్గొనేందుకు జగదల్పూర్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతున్న సమయంలోనే భారీ సంఖ్యలో నక్సల్స్ లొంగిపోవడం గమనార్హం.
Read Also: అర్ధరాత్రి అబ్బాయిలతో వెళ్లిన గురుకుల విద్యార్థినులు
Follow Us On: X(Twitter)


