కలం, నిర్మల్: జిల్లా (Nirmal) కేంద్రంలోని బంగల్పేట్ శివారులో ఉన్న వినాయక సాగర్ చెరువు (Vinayaka Sagar Lake) సమీపంలోని కుంటలో ఆదివారం ఓ యువకుడి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. మధ్యాహ్న సమయంలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. టౌన్ సీఐ సమ్మయ్య సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు భైంసా పట్టణానికి చెందిన షోయబ్గా గుర్తించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

