కలం, వెబ్ డెస్క్ : అనంతపురం (Anantapur) జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం పాతచెరువు గ్రామంలో ఓ మహిళ తన భర్తను చంపి ఇంటిముందే పాతిపెట్టింది. ఈ కేసులో భార్య సుకన్యను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలు.. నాలుగు నెలల క్రితం తన భర్త హనుమంతు (35) ను సుకన్య హత్య చేసింది. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి ముందే పాతిపెట్టింది. ఈ క్రమంలో హనుమంతు తల్లి, సుకన్యల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇది కాస్తా పోలీస్ స్టేషన్ కు చేరడంతో అసలు విషయం బయటపడింది. ఈ గొడవలోనే సుకన్య తను చేసిన నేరాన్ని ఒప్పుకుంది. తానే హనుమంతును హత్య చేసి ఇంటి ముందే పాతిపెట్టినట్లు పోలీసులకు చెప్పింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సుకన్యను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహం పాతిపెట్టిన స్థలంలో పోలీసులు తవ్వకాలు చేపట్టారు. కాగా, ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
Read Also: మార్కాపురం బస్సు ప్రమాదం.. పోలీసుల అదుపులో డ్రైవర్
Follow Us On: Instagram

